Ram Gopal Varma : రిషి సునక్ పై ఆర్జీవీ కీలక కామెంట్స్
ప్రవాస భారతీయుడికి దర్శకుడి కితాబు
Ram Gopal Varma : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరినీ ప్రశంసించడు. ఒకవేళ అలా కితాబు ఇచ్చారంటే ఏదో స్పెషాలిటీ ఉందన్నమాట. తాజాగా యావత్ ప్రపంచమంతా ఇప్పుడు బ్రిటన్ గురించి చర్చిస్తోంది. ప్రధానంగా అక్కడ భారతీయ సంతతికి చెందిన రిషి సునక్(Rishi Sunak) అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవిని అధీష్టించారు.
కేవలం ఆయన వయస్సు 42 ఏళ్లు మాత్రమే. బ్రిటన్ లోని అత్యంత ధనవంతుల జాబితాలో రిషి సునక్ కూడా ఒకరు. ఆయన ఎవరో కాదు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తిల గారాల ముద్దుల కూతురు అక్షతా మూర్తి భర్త. ఆమె ఇన్ఫోసిస్ లో కీలక భాగస్వామిగా ఉన్నారు.
నిన్న ఒక్క రోజే కోట్లాది రూపాయలు డివిడెండ్ రూపంలో అందుకున్నారు. ఇదిలా ఉండగా అక్షతా మూర్తి స్వతహాగా డిజైనర్..బిలియనీర్ కూడా. ఈ తరుణంలో రిషి సునక్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు వివిధ రంగాలకు చెందిన వారు. ఆయన భారతీయ మూలాలు మరిచి పోక పోవడంతో విపరీతమైన ప్రచారాన్ని పొందుతున్నారు.
మరో భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అయితే ఆనాటి బ్రిటన్ పీఎం విన్ స్టన్ చర్చిల్ భారతీయుల గురించి అన్న మాటల్ని ఉదహరించారు. ఇండియన్లకు పాలన చేత కాదాని ఇవాళ రిషి సునక్ నిరూపించాడని పేర్కొన్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సైతం రిషి సునక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
200 ఏళ్లు ఆంగ్లేయులు భారత దేశాన్ని పాలించారు. ఇన్నేళ్లకు బ్రిటషర్లను మనం పాలిస్తున్నామని గుర్తు చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : తళపతి విజయ్ ‘వారిసు’ పోస్టర్ వైరల్