IND vs NED T20 World Cup : పసికూనపై ప్రతాపం చూపిస్తారా
నేడే భారత్ నెదర్లాండ్ మ్యాచ్
IND vs NED T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నమీబియా చేతిలో ఓటమి పాలై చివరకు సూపర్ 12కు చేరుకున్న శ్రీలంక నానా తంటాలు పడుతోంది.
ఇక ఇదే టోర్నీలో అనామకులని అనుకున్న ఐర్లాండ్ చేతిలో బలమైన , టైటిల్ ఫేవరేట్ గా పరిగణిస్తున్న ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సో టి20 మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
ఇక ఇవాళ సూపర్ -12లో భాగంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పసికూనగా భావిస్తున్న నెదర్లాండ్స్ పై(IND vs NED T20 World Cup) ఆడనుంది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పై ఆసక్తి ఏ మాత్రం లేదు. కాక పోతే భారత జట్టుకు ఇది ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగ పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే టీమిండియా ప్రారంభ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టులో విరాట్ కోహ్లీ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓడి పోయే మ్యాచ్ ను గెలిపించారు కోహ్లీ, హార్దిక్ పాండ్యా.
ఒక రకంగా ఈ టోర్నీలోనే ఇప్పటి వరకు జరిగిన అద్భుతమైన మ్యాచ్ ఇది ఒక్కటి అని చెప్పక తప్పదు. ఇక భారత జట్టు పరంగా చూస్తే ఎలాంటి మార్పులు ఉండబోవంటూ ఇప్పటికే ప్రకటించారు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).
భారీ స్కోర్ సాధిస్తారా లేక చేతులెత్తేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : ఐసీసీ టాప్ 10లో విరాట్ సూర్య..కోహ్లీ