Sanjay Raut : బీజేపీ మౌనం సంజయ్ రౌత్ ఆగ్రహం
శివాజీని తూలనాడిన గవర్నర్ పై ఫైర్
Sanjay Raut : మరాఠా యోధుడు, కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా భావించే ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut). ఆయన ప్రధానంగా ఈ అంశాన్ని ఎత్తి చూపారు.
శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ప్రతి వారం వారం వివిధ అంశాలకు సంబంధించి కాలమ్ రాస్తుంటారు. ఈసారి మరాఠా యోధుడిని తూలనాడడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీ కావాలని ఇలా చేస్తోందంటూ మండిపడ్డారు సంజయ్ రౌత్.
మరాఠా ఆత్మ గౌరవాన్ని రాను రాను భ్రష్టు పట్టించేలా కేంద్రం యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ కోష్యారీతో పాటు ఆయన కామెంట్స్ కు వత్తాసు పలికిన బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, మరాఠా డిప్యూటీ సీఎం భార్య అమృత ఫడ్నవీస్ పై నిప్పులు చెరిగారు.
చరిత్రను విస్మరించిన వాళ్లు, దాని పట్ల గౌరవ భావం లేని వాళ్లు ఇలాంటి తప్పుడు , నీచమైన వ్యాఖ్యలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.
మహ్మద్ ప్రవక్తను దూషించిన సమయంలో బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మపై చర్యలు తీసుకున్న హిందూత్వ పార్టీ ఎందుకని శివాజీ విషయంలో మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు.
ఒక రకంగా ప్రధానిపై ఫైర్ అయ్యారు శివసేన అధికార పార్టీ ప్రతినిధి. మరాఠా యోధుడిని అవమానించిన గవర్నర్ క్షమాపణ చెప్పేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : మోదీ మోసం యుద్దానికి సిద్దం – టికాయత్