YS Sharmila : కేసీఆర్ మోసం తెలంగాణకు ద్రోహం – షర్మిల
ఉద్యమకారుడని ఛాన్స్ ఇస్తే కొల్లగొట్టిండు
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఉద్యమకారుడని సీఎంగా అవకాశం ఇస్తే తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిండంటూ ధ్వజమెత్తారు. షర్మిల(YS Sharmila) చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఉద్యమ కాలంలో కాపలా కుక్కగా ఉంటానని అన్నాడని కానీ ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పాడని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాంట్రాక్టు వ్యవస్థనే నడుస్తోందన్నారు వైఎస్ షర్మిల. నమ్మని ప్రజలను నట్టేట ముంచిండని, కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని ఆరోపించారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇన్ని కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.
కేసీఆర్ నమ్ముకుని లక్షలాది మంది నిరుద్యోగులు జాబ్స్ వస్తాయని వేచి చూస్తున్నారని కానీ వారి ఆశలపై నీళ్లు చల్లాడని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎందుకు సీఎం కేసీఆర్ ను ,ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నోరు మూసుకున్నాయని కేసీఆర్ కు అమ్ముడు పోయాయని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్(YS Sharmila) .
తమ పార్టీ ఒక్కటే ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చని పోయిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. తన కొడుకు, కూతురు, అల్లుళ్లకు పదవులు కట్ట బెట్టిన కేసీఆర్ బాగు పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు.
Also Read : తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి సోపానం