JP Nadda : రాజస్థాన్ ఎన్నిక‌ల్లో బీజేపీదే రాజ్యం

జోష్యం చెప్పిన పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా

JP Nadda : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ‌స్థాన్ లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి కాషాయ జెండా ఎర‌డం ఖాయ‌మ‌న్నారు. అంతే కాదు రాష్ట్రంలో గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. భారీ ఎత్తున సీట్లు గెలుచుకుంటామ‌ని చెప్పారు జేపీ న‌డ్డా(JP Nadda).

రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో జేపీ న‌డ్డా పాల్గొని ప్ర‌సంగించారు. దేశ వ్యాప్తంగా కాషాయ‌పు గాలి వీస్తోంద‌ని, ఆక్టోప‌స్ కంటే వేగంగా మ‌నం విస్త‌రించామ‌ని అన్నారు. మ‌నల్ని అడ్డుకునే శ‌క్తి ఏ పార్టీకి లేద‌న్నారు జేపీ న‌డ్డా. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒక్క‌టే జాతీయ పార్టీ అని దేశంలో మిగిలిన పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. సొల్లు క‌బుర్ల‌తో కాలం వెలి బుచ్చిందంటూ మండిప‌డ్డారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ నాలుగోవంతు మెజారిటీ సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు జేపీ న‌డ్డా(JP Nadda). ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది చివ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.

ఈసారి ఎక్క‌డా త‌గ్గ‌కుండా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు పార్టీ చీఫ్‌. కాంగ్రెస్ పూర్తిగా కుటుంబ పార్టీగా మారి పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌న్ ఆక్రోశ్ యాత్ర‌ను విజ‌య‌వంతం చేసినందుకు రాష్ట్ర నాయ‌క‌త్వానికి అభినంద‌న‌లు తెలియ చేశారు జేపీ న‌డ్డా. ఇలాంటి ప్ర‌చారాలు మ‌రిన్ని నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. మీకంద‌రికీ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : క‌త్తితో కేక్ క‌ట్ చేసిన రామ్ రహీమ్

Leave A Reply

Your Email Id will not be published!