Anil Kapoor K Viswanath : అనిల్ క‌పూర్ భావోద్వేగం

గురువును కోల్పోయాను

Anil Kapoor K Viswanath : క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ఇక లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక పోతున్నా. ఆ అద్భుత‌మైన ద‌ర్శ‌కుడి వ‌ద్ద ప‌ని చేసినందుకు గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్. తీవ్ర భావోద్వేగానికి లోన‌వుతున్నాన‌ని తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు. 1989లో ఈశ్వ‌ర్ చిత్రంలో కె.విశ్వ‌నాథ్ తో క‌లిసి పని చేశారు అనిల్ కపూర్(Anil Kapoor K Viswanath).

ఈ చిత్రంలో విజ‌య‌శాంతితో క‌లిసి న‌టించారు. క‌మ‌ల్ హాస‌న్ , రాధిక క‌లిసి న‌టించిన స్వాతి ముత్యం సినిమాకు హిందీలో రీమేక్ ఈశ్వ‌ర్ మూవీ. కె. విశ్వ‌నాథ్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నారు. ఆయ‌న న‌ట‌నా ప‌రంగా ఎలా ఉండాలో ఎలా ఉండ కూడ‌దో కూడా త‌న‌కు ద‌గ్గ‌రుండి నేర్పించార‌ని పేర్కొన్నారు.

ఈశ్వ‌ర్ సినిమా తీస్తున్న స‌మ‌యంలో మీతో సెట్ లో ఉండ‌గా దేవాల‌యంలో ఉన్న‌ట్లుగా ఉంద‌ని తెలిపారు. కె. విశ్వ‌నాథ్ పాదాల వ‌ద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాన్ని ఈ సంద‌ర్బంగా అనిల్ క‌పూర్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దీనిని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. నేను ప‌ని చేసిన ద‌ర్శ‌కుల‌లో క‌ళాత‌ప‌స్వి ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి అని కొనియాడారు అనిల్ కపూర్.

ఇదిలా ఉండ‌గా కె. విశ్వ‌నాథ్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా త‌మిళం, హిందీ భాషల్లో కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త గుర్తింపు క‌లిగి ఉన్నారు. ఆయ‌న‌కు భార్య జ‌య‌ల‌క్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయ‌న ప్ర‌పంచం గ‌ర్వించ ద‌గిన ద‌ర్శ‌కుడు అని కొనియాడారు. ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోటుగా పేర్కొన్నారు.

Also Read : ఎల్ల‌కాలం రుణ‌ప‌డి ఉంటాం

Leave A Reply

Your Email Id will not be published!