Revanth Reddy : పేప‌ర్ లీకు వెనుక కేటీఆర్ పీఏ హ‌స్తం

షాకింగ్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy KTR : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంపై రోజు రోజుకు తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇద్ద‌రు వ్య‌క్తుల త‌ప్పు వ‌ల్ల ఇదంతా జ‌రిగిందంటూ మంత్రి కేటీఆర్ చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని వెనుక క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఉంద‌ని ఆరోపించారు.

టీపీసీసీ పేప‌ర్ లీక్ క‌థ న‌డిపిందే కేటీఆర్ పీఏ తిరుప‌తి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy KTR) మీడియాతో మాట్లాడారు. పీఏ తిరుప‌తిది పేప‌ర్ లీక్స్ వ్య‌వ‌హారంలో ఏ2గా ఉన్న రాజ‌శేఖర్ రెడ్డిది ప‌క్క ప‌క్క ఊర్లేన‌ని చెప్పారు. అత‌డికి టీఎస్ పీఎస్సీలో కొలువు ఇప్పించిందే మంత్రి పీఏనంటూ మండిప‌డ్డారు.

కేటీఆర్ పీఏ తిరుప‌తి , నిందితుడు రాజ‌శేఖ‌ర్ స‌న్నిహితులంద‌రికీ గ్రూప్ -1 లో ఎక్కువ మార్కులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఇలా ఎలా వ‌స్తాయంటూ ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు షాడో సీఎం కేటీఆర్ అయితే కేటీఆర్ కు షాడో మంత్రి తిరుప‌తి అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. గ్రూప్ -1 లో 100కు పైగా ఎక్కువ మార్కులు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి వివ‌రాలు బ‌య‌ట పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

పెద్ద‌ల పేర్లు బ‌య‌ట పెట్ట‌కుండా నిందితుల‌పై ఒత్తిడి తెస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. చంచ‌ల్ గూడ జైలు సీసీ ఫుటేజ్ ను , వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టాల‌న్నారు రేవంత్ రెడ్డి. 2015 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ప‌రీక్ష‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

Also Read : క‌వితకు ఛాన్స్ ఇవ్వ‌కండి – ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!