Chandrababu Naidu Scam : రూ. 371 కోట్ల ఏపీసీడీసీ స్కామ్

షెల్ కంపెనీల ద్వారా కోట్ల త‌ర‌లింపు

Chandrababu Naidu Scam : విజ‌య‌వాడ‌- నంద్యాల‌లో టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడును ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. బాబు ప్రమేయం ఉంద‌ని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కీంలో స్కామ్ చోటు చేసుకుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Chandrababu Naidu Scam Issue

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 371 కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయ‌ని సీఐడీ స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో ఏ1గా పేర్కొంది. త‌న అరెస్ట్ పూర్తిగా అక్ర‌మ‌మ‌ని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. కాంట్రాక్టుల‌ను తారు మారు చేయ‌డం, ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డం, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ముసుగులో మోస పూరిత ప‌థ‌కాన్ని రూపొందించార‌ని ఆరోపించింది. చంద్ర‌బాబుతో(Chandrababu Naidu) పాటు ఇత‌రుల‌పై అభియోగాలు మోపింది.

జూన్ 2014లో చంద్ర‌బాబు ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఈ స్కాం వెలుగు చూసింది. మొత్తం ఖ‌ర్చు రూ. 3,356 కోట్లు. స‌ర్కార్ 10 శాతం అందించింది. సిమెన్స్ 90 శాతం నిధులు ఇవ్వాల‌ని ఒప్పందంలో ఉంది. కేసు సంద‌ర్బంగా విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌భుత్వం జారీ చేసిన జాయింట్ వెంచ‌ర్ లేదా ఎంఓయూ లో త‌మ కంపెనీకి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది సిమెన్స్ కంపెనీ.

ఈ సొమ్ముతో 70కి పైగా లావాదేవీలు షెల్ కంపెనీల ద్వారా జ‌రిగిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. స్కామ్ ను ఏసీబీకి అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. స‌ద‌రు కంపెనీలు జీఎస్టీ ఎత్తి చూపింది. 2017లోనే హ‌వాలా మార్గాల ద్వారా న‌గ‌దు బ‌దిలీ జ‌రిగిన‌ట్లు గుర్తించింది.

Also Read : Chandrababu Naidu : ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు

Leave A Reply

Your Email Id will not be published!