Chandrababu Naidu : విజయవాడకు బాబు తరలింపు
విజయవాడలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు
Chandrababu Naidu : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఇస్తామని స్పష్టం చేసింది సీఐడీ.
Chandrababu Naidu Shifted to Vijayawada
నంద్యాలలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ వాహనంలో విజయవాడకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం తెలిపింది ఏపీ సీఐడీ.
చివరకు తన స్వంత వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఒప్పుకుంది. భారీ భద్రతా బలగాల మధ్య చంద్రబాబు నాయుడును విజయవాడకు తరలించారు. ఇవాళ , రేపు సెలవు రోజులు కావడంతో ఆయనను మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరిచారు.
ఎక్కడికి తీసుకు వెళతారనే దానిపై ఉత్కంఠకు తెర దించారు పోలీసులు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు పరీక్షలు చేశారు. అక్కడి నుంచి ముందుగా విజయవాడ సీఐడీ ఆఫీసుకు తీసుకు వెళతారు. అక్కడ సంతకాలు తీసుకుంటారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ వద్దకు తీసుకు వెళతామని స్పష్టం చేశారు.
Also Read : Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు అరెస్ట్ సబబే