TS DSC Post Poned : డీఎస్సీ పరీక్ష వాయిదా
ఎన్నికల ఎఫెక్ట్
TS DSC Post Poned : తెలంగాణ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ నుండడంతో డిఎస్సీ (జిల్లా ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పరీక్షను వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే సర్కార్ డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 20 వరకు గడువు విధించింది. ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
TS DSC Post Poned Due to Elections
లక్షలాది మంది నిరుద్యోగులు రేయింబవళ్లు డీఎస్సీ వస్తుందని, జాబ్స్ దక్కుతాయని భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది మరోసారి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు 5 రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగించింది.
దీంతో తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి ఎన్నికల కోడ్ ప్రారంభమైంది. నవంబర్ 3న ప్రభుత్వ పరంగా గెజిట్ ప్రకటిస్తుంది. 13 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది ఈసీ. 15న దరఖాస్లు ఉపసంహరణకు గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
Also Read : Bathukamma Festival : ఆడబిడ్డల సంబురం బతుకమ్మ ఉత్సవం