Minister KTR : కాంగ్రెస్ కుతంత్రం కేటీఆర్ ఆగ్రహం
ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ . రైతు బంధు ఇవ్వకుండా నిలిపి వేయాలని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఆ పార్టీకి చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్.
Minister KTR Slams Congress
బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నమ్మి ఓట్లు వేసిన పాపానికి కర్ణాటక సర్కార్ చుక్కలు చూపిస్తోందని, రైతులు రోడ్డెక్కారని పేర్కొన్నారు. ఇంటింటికీ మంచి నీళ్లు , 24 గంటల పాటు అందించడం కూడా నేరమేనా అని కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు.
కాంగ్రెస్ అంటేనే రైతులకు వ్యతిరేకమని అర్థమై పోయిందన్నారు. అన్నదాతల పాలిట నెంబర్ వన్ విలన్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. కపట కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏమిటో బట్ట బయలైందని పేర్కొన్నారు.
రైతు బంధును ఆపాలని లేఖలు రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక రైతులు అరిగోస పెడుతున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. కడుపు నిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారంటూ మండిపడ్డారు.
Also Read : AUS vs NED ODI World Cup : ఆస్ట్రేలియా జోర్దార్ విక్టరీ