Raj Gopal Reddy : నా రాజీనామా అభివృద్దికి చిరునామా
కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి
Raj Gopal Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నిసార్లు నిధుల కోసం కొట్లాడినా, ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. దీంతో తాను తన పదవికి ఎప్పుడైతే రాజీనామా చేశానో ఆనాటి నుంచి మునుగోడుకు నీళ్లలా నిధులు వచ్చాయని అన్నారు.
Raj Gopal Reddy Comment
లేక పోతే నియోజకవర్గం అభివృద్ది జరగక పోయి ఉండేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raj Gopal Reddy). లేకపోతే కేసీఆర్ దీనిపై ఫోకస్ పెట్టి ఉండే వారా అని ప్రశ్నించారు. గట్టుప్పల మండలమైంది. చంండూరు రెవిన్యూ డివిజన్ గా మారింది. చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందిందన్నారు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.
అంతే కాదు చౌటుప్పల్ వద్ద 100 పడకల ఆస్పత్రి ఏర్పాటైందన్నారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వచ్చాయని, ఇవాళ గతంలో కంటే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందిందని, ఇదంతా తాను పదవికి రాజీనామా చేయడం వల్ల సాధ్యమైందని స్పష్టం చేశారు. అందుకే మరోసారి తాను పార్టీ నుండి బరిలోకి దిగ బోతున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Also Read : Kichannagari Laxma Reddy : సబితపై పోటీకి కిచ్చెన్నకు ఛాన్స్