Congress Pending : పెండింగ్ లో 19 స్థానాలు
ఇంకా ఖరారు చేయని కాంగ్రెస్
Congress Pending : తెలంగాణ – నిన్నటి దాకా బీసీ జపం చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు రెడ్లకే ప్రయారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో 119 స్థానాలకు గాను తొలి విడతలో 55 సీట్లను ఖరారు చేసింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ . తాజాగా 45 మందితో రెండో లిస్టు ప్రకటించింది.
Congress Pending Seats
మొత్తంగా 100 సీట్లకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్(Congress) ఇంకా 19 సీట్లను పెండింగ్ లో ఉంచింది. నవంబర్ 3న గెజిట్ రానుంది. 13న దరఖాస్తులు చేసేందుకు , విరమించు కునేందుకు 15న గడువు విధించింది ఈసీ. ఇదే సమయంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.
కాగా ఇంకా ఖరారు కాని స్థానాలు ఇలా ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ప్రకటించిన వాటిలో చెన్నూరు, జుక్కల్, బాన్సు వాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ , కరీంనగర్, సిరిసిల్ల, నారాయణ్ ఖేడ్ , పటాన్ చెరు, చార్మినార్ , మిర్యాల గూడ ఉన్నాయి.
వీటితో పాటు సూర్యా పేట, తుంగతుర్తి, డోర్నకల్, ఇల్లందు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట స్థానాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
Also Read : PAK vs SA ICC World Cup : ఉత్కంఠ పోరులో సఫారీదే హవా