KTR : తన సోదరి జైలులో ఇబ్బంది పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటిఆర్
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలన్నారు...
KTR : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న తన చెల్లెలు కవిత గురించి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు తీహార్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని, బీపీ వచ్చిందని పేర్కొన్నారు. దాని వల్ల రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందన్నారు.
KTR Comment
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలన్నారు. దేశంలో పొలిటికల్గా కోట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని చెప్పుకొచ్చారు. బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేశామని, వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జైల్లో ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేలు మంది ఉన్నారన్నారు. జైలు పరిశుభ్రంగా లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు భవిష్యత్లో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : Sunita Kejriwal : మనీష్ సిసోడియా బెయిల్ రాక పై స్పందించిన కేజ్రీవాల్ భార్య