ముంబై : ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు పెరిగి 95.32కి చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ డాలర్ బలహీనపడటం, చమురు ధరలు తగ్గడం దీనికి కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, పశ్చిమాసియాలో కొత్త ఉద్రిక్తతల వల్ల కలిగిన అనిశ్చితి రూపాయిపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభం కావడం కొంత ఊరటనిచ్చిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున అమెరికా ఇరాన్పై కొత్తగా వైమానిక దాడులు చేసింది . దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్ అమెరికా మిత్రదేశాలైన పశ్చిమాసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఈ పరస్పర దాడులు యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందానికి ముప్పు కలిగించేలా ఉన్నాయి.
అంతకు ముందు రోజు జరిగిన దాడులతో సహా ఇలాంటి పరస్పర దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ప్రమాదంలో పడేశాయి. అయితే నిన్నటి నాటి దాడులు మరింత తీవ్రంగా ఉన్నట్లు కనిపించాయి.. అమెరికా నావికాదళంకు చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్లో కనీసం మూడుసార్లు సైరన్లు మోగగా, కువైట్ , ఖతార్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో, రూపాయి డాలర్తో పోలిస్తే 95.27 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 95.32 స్థాయికి చేరింది (ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 15 పైసల పెరుగుదల). ఇక రూపాయి విలువ కేవలం 1 పైసా పెరిగి 95.47 వద్ద స్థిరపడింది.
