హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు వంగా సందీప్ రెడ్డి మరోసారి చర్చకు దారితీసేలా కామెంట్స్ చేశాడు. తను ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో దీనిని రూపొందిస్తున్నాడు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా నిర్మాత వ్యాఖ్యలతో ‘స్పిరిట్’ చిత్రం నుండి దీపికా పదుకొణె తప్పుకోవడంపై మళ్లీ చర్చ జరగడం విస్తు పోయేలా చేసింది. మొదటగా దీపికా ను తీసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు వంగా. తను అన్ని రోజులు కేటాయించలేనంటూ తప్పుకుంది. ఈ సందర్బంగా వంగా సందీప్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి మరోసారి చర్చకు రావడం విచిత్రం.
ఇదిలా ఉండగా ప్రభాస్ రాబోయే చిత్రం ‘స్పిరిట్’కు సంబంధించి, నటి దీపికా పదుకొణె గురించి నిర్మాత ప్రణయ్ వంగా చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి కొత్త మలుపునిచ్చాయి.నిర్మాత తెలిపిన వివరాల ప్రకారం దీపిక మొదట్లో ఈ ప్రాజెక్ట్లో భాగమైనప్పటికీ, ఆ ఒప్పందం ముందుకు సాగలేదు. పారితోషికం, షూటింగ్ షెడ్యూల్స్ , చిత్ర లాభాల్లో వాటా వంటి విషయాలపై వచ్చిన విభేదాలు ఆమె తప్పుకోవడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. ‘స్పిరిట్’ నుండి దీపిక తప్పుకున్నారన్న వార్త అప్పటికే పెద్ద చర్చనీయాంశంగా మారగా, నిర్మాత చేసిన తాజా వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘స్పిరిట్’ చిత్రం రూపొందుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు ప్రభాస్ కలయిక కావడంతో, భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లలో ఇది ఒకటిగా నిలిచింది. ప్రస్తుతానికి అందరి దృష్టి మరోసారి దీపికా పదుకొణె ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన పరిణామాలపై పడింది. ఈ తాజా వ్యాఖ్యలు , ఆరోపణలపై చిత్ర బృందం ఇంకా ఎటువంటి అధికారిక వివరణాత్మక ప్రకటన చేయలేదు.
