ముంబై : భారత దేశంలో అత్యంత నమ్మకమైన సంస్థగా పేరు పొందింది టాటా గ్రూప్. రతన్ టాటా చని పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇప్పటి వరకు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉన్న ఎన్. చంద్రశేఖరన్ తాను ఉండదల్చు కోవడం లేదని సంచలన ప్రకటన చేశారు. ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ఇదిలా ఉండగా టాటా సన్స్ చీఫ్ రవి రంజన్ ప్రసాద్ను ఎంపిక చేయడానికి టాటా ట్రస్ట్స్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తదుపరి చైర్మన్ టాటా అంతర్గత వ్యక్తి అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి . ప్రాధాన్యత మూలంగా టాటా సన్స్ కొత్త చైర్మన్ను నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక కమిటీని ఏర్పాటు చేసేందుకు టాటా ట్రస్ట్స్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. టాటా ట్రస్ట్స్ జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం ఈ కమిటీ టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త చైర్మన్గా నియమించడానికి ఒక వ్యక్తిని సిఫార్సు చేస్తుంది.
టాటా గ్రూప్ కంపెనీలను నియంత్రించే టాటా సన్స్ చైర్మన్గా తన 10 ఏళ్ల పదవీకాలం ఫిబ్రవరి 20, 2027న ముగియనుంది. దీంతో ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన రెండవ పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియామకం కోరబోనని టాటా సన్స్ బోర్డుకు తెలియజేశారు. టాటా సన్స్ నియమావళికి అనుగుణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త ఛైర్మన్గా నియామకం కోసం ఒక వ్యక్తిని సిఫార్సు చేసే ఉద్దేశ్యంతో వీలైనంత త్వరగా ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసేందుకు సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ ధర్మకర్తలు ఒక తీర్మానాన్ని ఆమోదించారు అని టాటా ట్రస్ట్స్ తెలిపింది. టాటా సన్స్ , టాటా గ్రూప్ విలువలు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా, నాయకత్వ మార్పు సజావుగా సకాలంలో, క్రమబద్ధంగా జరిగేలా చూడటంలో తాము టాటా సన్స్కు మా పూర్తి మద్దతును అందిస్తున్నామనని పేర్కొన్నారు. టాటా సన్స్ ఛైర్మన్గా తన పదవీకాలంలో చంద్రశేఖరన్ చేసిన సేవలను కూడా ఇది గుర్తించింది.
