అమెరికా : బీజేపీని, దేశాన్ని నియంత్రిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై తక్షణమే నిషేధం విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిషన్ పిలుపు డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం యుఎస్సీఐఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఉన్నత స్థాయి చర్చలను వ్యతిరేకించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ లో సభ్యుడని, దీనిని మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలపై దాడులకు పాల్పడిన అనుబంధ సంస్థలను కలిగిన ఒక విస్తృత సంస్థగా అభివర్ణించారు. మత స్వేచ్ఛపై సలహాలు ఇచ్చే అమెరికా కమిషన్ అధికారులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆ సంస్థ నాయకులకు దౌత్యపరమైన మర్యాదలు చూప కూడదని లేదా వారితో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించ కూడదని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం చైర్ ఆసిఫ్ మహమూద్ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
న్యూయార్క్లో ఆగస్టు 29న ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్’ నిర్వహించే ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్’లో పాల్గొనేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికాలో పర్యటించనున్న తరుణంలో మహమూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వంతో సంబంధం ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు ఉన్నత స్థాయి సమావేశాలు లేదా దౌత్యపరమైన మర్యాదలతో గౌరవం ఇవ్వకూడదని కమిషనర్ జీన్ మిల్స్ అన్నారు. దీనికి బదులుగా, మత విశ్వాస స్వేచ్ఛ ఉల్లంఘనలకు బాధ్యులుగా తేలిన ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించడంపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించాలి అని మిల్స్ పేర్కొన్నారు. భగవత్ పర్యటనను, ముస్లింలు , క్రైస్తవులపై ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ చేస్తున్న హింస నుండి వేరు చేయలేమని ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ అనే న్యాయవాద బృందం పేర్కొంది.
