Mahesh Trivikram : ‘త్రివిక్రం..మ‌హేష్’ చిత్రం ప్రారంభం

ప్రిన్స్ తో శ్రీ‌నివాస్ మూడో సినిమా

c పేరొన్న ప్రిన్స్ మ‌హేష్ బాబుతో మూవీకి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు.

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన అత‌డు మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచింది. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖ‌లేజా విజ‌యాన్ని సాధించింది.

ఆ రెండు చిత్రాల గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ (Mahesh Trivikram)తో రాబోతున్న మూడో చిత్రాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది మంది అభిమానుల‌కు తీపిక‌బురు చెప్పారు.

గ‌త కొంత కాలంగా వ‌స్తుందా రాదా అన్న అనుమానాల‌కు తెర దించారు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఎట్ట‌కేల‌కు సినిమాకు ఇవాళ పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఇదిలా ఉండ‌గా ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేశ్ బాబు హాజ‌రు కాలేదు. ఆయ‌న‌కు బ‌దులు భార్య , మాజీ న‌టి న‌మ్ర‌త శిరోద్క‌ర్ పాల్గొన్నారు. ఈ మూవీని హారికా క్రియేష‌న్స్ లో వ‌స్తోంది.

ఇదే క్రియేష‌న్స్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సినిమాలు తీసింది. ఇక మ‌హేష్ బాబు త‌న కెరీర్ ప‌రంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Mahesh Trivikram) తో తీసే సినిమా తో 28వది కాబోతోంది.

మ‌రో వైపు సామాజిక మాధ్య‌మాల‌లో తానే తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన అత‌డు మూవీకి సీక్వెల్ గా వ‌స్తోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే చిత్రానికి సంబంధిచి పార్థు అని పేరు కూడా డిసైడ్ చేసిన‌ట్లు టాక్. ఏది ఏమైనా మాట‌ల మాంత్రికుడిగా పేరుంది త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. డైలాగ్ డెలివ‌రీలో త‌నకంటూ ఓ స్పెషాలిటీ ఉన్న ప్రిన్స్ తో రానున్న మూవీపై ఎంతో ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : స‌మంత ‘టీ ష‌ర్ట్’ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!