Veerappa Moily : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నడూ లేనంతగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండు వర్గాలుగా చీలి పోయాయి.
ఓ వర్గం సోనియా గాంధీ (Sonia Gandhi)కుటుంబానికి మద్దతుగా మారి పోతే ఇంకో ఓ వర్గం గాంధీ ( Gandhi ) ఫ్యామిలీ రిజైన్ చేసి స్వచ్చంధంగా తప్పు కోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ (Twitter) వేదికగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశారు ఒకరు కపిల్ సిబాల్ అయితే మరొకరు మాణిక్యం ఠాగూర్. జీ-23 టీంకు నాయకత్వం వహిస్తున్నారు గులాం నబీ ఆజాద్. ఆయన నివాసంలో సమావేశమయ్యారు గాంధీ ( Gandhi )వ్యతిరేకులు.
ఈ సందర్భంగా సిబల్ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై నిప్పులు చెరిగారు మాణిక్యం ఠాగూర్. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ(Veerappa Moily )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీకి ఆయన వీర విధేయుడిగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) మేడం ఒక్కరే దిక్కు అని, ఆమెనే పూర్తి బాధ్యతలు చేపట్టి నడిపించాలని కోరారు.
పార్టీపై పూర్తి నియంత్రణ తెచ్చు కోవాలని, పని చేయని వారిని సాగనంపాలని సూచించారు. పార్టీలోకి ఊహించని రీతిలో అవకాశవాదులు వచ్చారని, వారిని గుర్తించి పక్కన పెడితేనే మంచిదన్నారు వీరప్ప మొయిలీ(Veerappa Moily).
ఇదిలా ఉండగా పంజాబ్ విషయంలో తనదే తప్పని సోనియా గాంధీ (Sonia Gandhi )సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం అమరీందర్ సింగ్ (Amarinder Singh) గాంధీ ఫ్యామిలీ వల్లనే పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆరోపించారు.
Also Read : సిబల్ కామెంట్స్ ఠాగూర్ సీరియస్