Agnimitra Paul : దమ్ముంటే నాపై గెల‌వాలి

శ‌త్రుఘ్న సిన్హాకు పాల్ స‌వాల్

Agnimitra Paul  : ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ టీఎంసీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే పవ‌ర్ లోకి రావాల‌ని అనుకున్న బీజేపీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది టీఎంసీ. ఇటీవ‌ల జ‌రిగిన పుర‌పాలిక ఎన్నిక‌ల్లో సైతం టీఎంసీ స‌త్తా చాటింది.

తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు బాబుల్ సుప్రియో ఎన్నిక‌ల కంటే ముందు కేంద్ర మంత్రి ప‌ద‌వికి, బీజేపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశాడు. సుప్రియో టీఎంసీలో చేరాడు.

దీంతో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అస‌న్ సోల్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ప్ర‌ముఖ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హాకు ఎంపీగా ఉప ఎన్నిక‌లో బ‌రిలో కి దిగ‌నున్నారు టీఎంసీ త‌ర‌పున‌. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాబుల్ సుప్రియో బ‌రిలో కి దిగ‌నున్నారు.

శ‌త్రుఘ్న సిన్హా కు పోటీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ అభ్య‌ర్థిగా అగ్ని మిత్ర పాల్(Agnimitra Paul )ను ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో త‌న‌పై పోటీ చేసే సిన్హాకు ద‌మ్ముంటే గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు.

ఇవాళ ఆమె ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఆమె అస‌న్సోల్ సౌత్ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆమె గ‌తంలో ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా చేశారు. మోస్ట్ పాపుల‌ర్ విమెన్ గా పేరొందారు.

ఇదిలా ఉండ‌గా కోల్ క‌తా లోని బ‌ల్లిగుంజే అసెంబ్లీ స్థానానికి కియా ఘోష్ పార్టీ అభ్య‌ర్థిగా నామినేట్ అయ్యారు. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఈ పేర్ల‌ను ప్ర‌క‌టించింద‌ని ఆ పార్టీ ప‌శ్చిమ బెంగాల్ అధికార ప్ర‌తినిధి స‌మిక్ భ‌ట్టాచార్య తెలిపారు.

ఏప్రిల్ 12న రెండు స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతుంది. 16న ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. సిన్హాపై అగ్నిమిత్ర పాల్ చేసిన స‌వాల్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read : పంజాబ్ లో కొలువుతీరిన కేబినెట్

Leave A Reply

Your Email Id will not be published!