Om Prakash Rajbhar : భేటీ అబ‌ద్దం క‌లిసే పోటీ చేస్తాం

ఎస్పీఎస్పీ చీఫ్ ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్

Om Prakash Rajbhar : సుహెల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ చీఫ్ ఓం ప్ర‌కాశ్ రాజ్ భేర్(Om Prakash Rajbhar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను కేంద్ర హొం శాఖ మంత్రి మంత్రి అమిత్ షాతో భేటీ అయిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై సీరియ‌స్ అయ్యారు.

అదంతా అబ‌ద్ద‌మంటూ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో తాము ఇద్ద‌రం క‌లిసి ఉన్న ఫోటోల‌తో ఇప్పుడు తిరిగి క‌లుస్తున్నానంటూ పుకార్లు సృష్టించారంటూ మండిప‌డ్డారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. సామాజిక మాధ్య‌మాల‌లో వ‌స్తున్న‌దంతా పూర్తిగా నిరాధార‌మైన‌దంటూ పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి ప్ర‌ధానంగా రాష్ట్రంలో బ‌డుగు, బ‌ల‌హీన‌, పేద‌, మైనార్టీ వ‌ర్గాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ వ‌చ్చిన యోగి ప్ర‌భుత్వం తాము ఇంకెలా క‌లుస్తామ‌ని ప్ర‌శ్నించారు ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్(Om Prakash Rajbhar).

తాజాగా యూపీలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగే కంటే ముందు యోగి కేబినెట్ లో కూడా కొలువు తీరారు. యోగి తీరు న‌చ్చ‌క బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ తో క‌లిసి బ‌రిలో ఉన్నారు.

భ‌విష్య‌త్తులో కూడా ఎస్పీతోనే పొత్తు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్. త్వ‌ర‌లో జ‌రగ బోయే లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లోనూ కూడా కలిసే పోటీ చేస్తామ‌న్నారు.

రాబోయే 2024లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంటామ‌న్నారు. పార్టీకి సంబంధించిన శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వీటిని న‌మ్మ వ‌ద్దంటూ కోరారు రాజ్ భ‌ర్.

Also Read : దమ్ముంటే నాపై గెల‌వాలి

Leave A Reply

Your Email Id will not be published!