Parasuram : పరుశురామ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట ఈనెల 12న విడుదలైంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో కోట్లు కొల్ల గొడుతోంది. భారీ ఎత్తున బాక్సులు బద్దలవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే చేసిన ఖర్చంతా తిరిగి వచ్చేసింది.
దీంతో నిర్మాతలు, చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సక్సెస్ మీట్ చేస్తున్నారు. రూ. 200 కోట్లకు దగ్గరగా చేరుకోవడంతో కర్నూలులో జరిగిన సభలో మహేష్ బాబు మొదటిసారిగా డ్యాన్స్ చేశారు.
పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ కు, పరుశురామ్ కు థ్యాంక్స్ చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రిన్స్ ను ఈ సర్కార్ వారి పాటలో లవర్ బాయ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
ఇక మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య లవ్ ట్రాక్ బాగా పండింది. ఇదే విషయాన్ని ప్రిన్స్ కూడా సభా ముఖంగా చెప్పాడు. తాజాగా హీరో, దర్శకుడు ఇద్దరూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.
సినిమా విడుదలైన మొదటి రోజే లవ్ ట్రాక్ బాగా పండిందని, తనను కొత్తగా చూపించిన విధానం బాగుందంటూ ఫోన్ చేసి చెప్పారంటూ దర్శకుడు పరుశురామ్(Parasuram) వెల్లడించాడు.
ఇంత భారీ హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు, తనకు సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబుకు, తనను నమ్మి డబ్బులు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ కు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు.
Also Read : దళపతి కేసీఆర్ ను కలిసిన తలపతి