Neelam Gorhe : శివ‌సేన రెబ‌ల్స్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు

శివ‌సేన అగ్ర నాయ‌కురాలు నీలం గోర్హే

Neelam Gorhe : శివ‌సేన అగ్ర నాయ‌కురాలు నీలం గోర్హే(Neelam Gorhe) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌జ‌లు న‌మ్మి శివ‌సేన ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. అంతే కాదు బాలా సాహెబ్ ఠాక్రే ఆశ‌ల్ని, ఆశ‌యాల్ని తీరుస్తార‌ని. కానీ మీరు చేసింది ఏమిటి. బాలా సాహెబ్ పేరును త‌ల‌వంచేలా చేశారు.

ఒక ర‌కంగా మీరు మ‌రాఠా ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగించారు. అంతే కాదు ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న చ‌రిత్ర మ‌రాఠాది.

మ‌రాఠా అంటే పోరాటం. మ‌రాఠా అంటే పౌరుషం. త‌ల‌వంచ‌ని ధీర‌త్వం. హిందుత్వ సూత్రాల‌కు ద్రోహం త‌లపెట్టారంటూ నిప్పులు చెరిగారు నీలం గోర్హే.

ఏం న‌ష్టం వాటిల్లింద‌ని, ఏం ఇబ్బంది ఏర్ప‌డింద‌ని ఇత‌రుల మాయ మాట‌ల‌కు లొంగి పోయారంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

నిన్న‌టి దాకా మీకు తెలియ‌కుండా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేద‌న్న వాస్త‌వాన్ని అప్పుడే మ‌రిచి పోయారా అని నిల‌దీశారు. మీరు ధిక్కార స్వ‌రాన్ని వినిపించారు.

కానీ మీ రాజ‌కీయ కెరీర్ లో కోలుకోలేని త‌ప్పును చేశార‌ని గుర్తుంచు కోవాల‌న్నారు. మ‌రాఠా ప్ర‌జ‌లు దేనిని తేలిక‌గా తీసుకోర‌ని, ఆ విష‌యం త‌న‌కంటే మీకు బాగా తెలుసని గుర్తు చేశారు డాక్ట‌ర్ నీలం గోర్హే(Neelam Gorhe).

మీరు ఎమ్మెల్యేలుగా ఇవాళ ఉన్నారంటే కార‌ణం బాలా సాహెబ్ ఠాక్రే పెట్టిన భిక్ష‌. ఒక‌వేళ మీరు స్వంతంగా నిల‌వాలంటే తాము అభ్యంత‌రం పెట్ట‌మ‌న్నారు.

కానీ పార్టీ పేరు మీద గెలిచి, దాని మీద మీరు నిలిచి ఎవ‌రో ఇచ్చే ఆఫ‌ర్లకు ఎలా లొంగి పోయారంటూ ప్ర‌శ్నించారు నీలం గోర్హే. మ‌రాఠాకు మీరు చేసిన ద్రోహాన్ని ఎప్ప‌టికీ ప్ర‌జ‌లు మ‌రిచి పోర‌న్నారు.

Also Read : రెబ‌ల్స్ ఆశ‌లు ఫ‌లించ‌వు – ప్రియాంక

Leave A Reply

Your Email Id will not be published!