Daggubati Purandeswari: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే – బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే - బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

Daggubati Purandeswari: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్‌ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ అవినీతి, అక్రమ, కుట్ర రాజకీయాలపై ఆమె తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

Daggubati Purandeswari Comment

బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగడం అవసరమా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం ఉందన్నారు. ఇవన్నీ చాలవన్నట్టుగా సచివాలయం, రాష్ట్రంలో గనులు కూడా తనఖా పెడుతున్నారని విమర్శించారు. పైగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ? అని ఎదురు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్యం నియంత్రణ అని చెప్పి… ఏరులై పారించారని ధ్వజమెత్తారు.

Also Read : Pawan Kalyan: పిఠాపురం గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి – పవన్‌ కళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!