ముంబై : బాలీవుడ్ లో ప్రముఖ నటీమణులైన తాప్సీ పన్ను, కంగనా రనౌత్ ల మధ్య మరోసారి కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో తాప్సీ పన్నును చౌకబారు నకలు అని పేర్కొంది కంగనా రనౌత్. తొలగించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లతో వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఉన్న బహిరంగ వివాదం మళ్లీ రాజుకుంది. నటి , ఎంపీ అయిన కంగనా రనౌత్, నటి తాప్సీ పన్నుపై సోషల్ మీడియాలో కొత్తగా విమర్శలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీసేలా చేసింది. తన పెంపకం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ వివాదాన్ని పునరుద్ధరించారు. తమ మధ్య ఉన్న విభేదాల గురించి తాప్సీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందనగా కంగనా రెండు ఇన్స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేశారు. అయితే ఆదివారం ఉదయానికి ఆ పోస్ట్లను తొలగించారు. ఒక పోస్ట్లో కంగనా తాప్సీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమెను చౌకబారు నకలు అని పేర్కొన్నారు. అలాగే, తన పెంపకం మరియు తల్లిదండ్రుల గురించి వ్యాఖ్యానించడం ద్వారా తాప్సీ హద్దులు దాటారని ఆరోపించారు.
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్న కంగనా రనౌత్ గతంలో జరిగిన వాదనల్లో తాను కుటుంబ సభ్యులను ఎప్పుడూ లాగలేదని చెప్పారు. ఆ తర్వాత, తాప్సీ తల్లిదండ్రులు అసలైన వ్యక్తికి ఎందుకు జన్మను ఇవ్వలేక పోయారని ప్రశ్నించిన ఆమె, వారి ప్రయత్నాల పట్ల తనకు జాలి కలుగుతోందని అన్నారు. తాప్సీతో తనకున్న దీర్ఘకాలిక విభేదాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ బహిరంగ విభేదాలు బయట పడటానికి ముందు గానీ, ఆ తర్వాత గానీ తాము ఎప్పుడూ ప్రత్యక్షంగా కలుసుకోలేదని తాప్సీ చెప్పారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు పేరెంట్స్ పెంపకం పట్ల. వ్యక్తుల అభిప్రాయాలు, ప్రవర్తన వారి పెంపకం , నేపథ్యం ద్వారా ప్రభావితం కావచ్చని అభిప్రాయపడ్డారు. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలను కంగనా తన కుటుంబం , పెంపకం గురించిన విమర్శలుగా భావించి తీవ్రంగా స్పందించారు.
