Magunta Sreenivasulu Reddy: ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిని మార్చిన టీడీపీ !

ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిని మార్చిన టీడీపీ !

Magunta Sreenivasulu Reddy: గెలుపేలక్ష్యంగా అసెంబ్లీ, లోక్ సభ సీట్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అవసరమైతే మార్పులు చేర్పులకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిని మార్చినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఇటీవల ప్రకటించింది. అయితే రాఘవరెడ్డి కంటే… అతని తండ్రి, సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి అయితే బాగుంటుందని భావించిన టీడీపీ అధిష్టానం… పార్టీ అభ్యర్ధుని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది.

Magunta Sreenivasulu Reddy in….

ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల…. వైసీపీను వీడి టీడీపీలో చేరారు. వైసీపీలో సీటు దక్కకపోవడంతోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీలో దించడానికి టీడీపీ సిద్ధపడింది. అయితే రాఘవరెడ్డికి ప్రత్యర్ధిగా వైసీపీ నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బలమైన నేత ఉండటంతో…. టీడీపీ తన వ్యూహాన్ని మర్చింది. రాఘవరెడ్డి స్థానంలో అతని తండ్రి, ఎంపీ శ్రీనువాసులురెడ్డి ని బరిలో దించడానికి నిర్ణయించింది.

Also Read : Pawan Kalyan: పవన్‌ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్‌ !

Leave A Reply

Your Email Id will not be published!