Pawan Kalyan: పవన్‌ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్‌ !

పవన్‌ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్‌ !

Pawan Kalyan: జనసేన ఎన్నికల ప్రచారంలో సమరశంఖం పూరించడానికి సిద్ధమయింది. టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తుతో పాటు సీట్ల కేటాయింపు కూడా తుది దశకు చేరుకోవడంతో… ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయించారు. దీనిలో భాగంగా తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు… పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల అంటే మార్చి 30 నుంచి పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ప్రకటించారు.

Pawan Kalyan Meeting

ఈ నెల 30న పిఠాపురం వెళ్లిన తొలిరోజు అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నేతలతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని… పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్‌ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉగాది వేడుకలను సైతం పవన్‌ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.

Also Read : BRS MP List: హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ !

Leave A Reply

Your Email Id will not be published!