Nirmala Sitharaman : కేంద్ర మంత్రి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులతో మాట మంతి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలో లోకల్ రైలు ఎక్కారు

Nirmala Sitharaman : రాజకీయ నేతలు నిత్యం ప్రజా వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఒక్కోసారి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. తమ పొజిషన్, మర్చిపోయి మామూలు మనుషుల్లా ప్రవర్తిస్తారు. గల్లీ లీడర్ల దగ్గర్నుంచి ఢిల్లీ లీడర్ల వరకు ఖాళీ దొరికినప్పుడల్లా ఎవరికిష్టమైనవి వారు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహాయింపు కాదు. దేశాభివృద్ధికి ఆమె శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. స్థానిక రైళ్లలో ప్రయాణించడం విశేషం.

Nirmala Sitharaman Tweeet Viral

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలో లోకల్ రైలు ఎక్కారు. దీంతో అక్కడి సాధారణ పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ఒక కేంద్ర మంత్రి తమతో పాటు వస్తున్నారంటే నమ్మలేకపోయారు. దీంతోపాటు మంత్రి నిర్మల(Nirmala Sitharaman) వారితో ముచ్చటించారు. చివర్లో అందరితో సెల్ఫీలు దిగారు. ఆమె ఘట్కోపర్ నుండి కళ్యాణ్ వరకు లోకల్ రైలులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో ట్వీట్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి.

కాగా ముంబైలో లోకల్ రైళ్లు హార్ట్ లైన్ గా మారాయి . ప్రతిరోజూ 60,000 మంది ప్రయాణికులు తమ విధులకు వెళ్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గతంలో పలుమార్లు ప్రజా రవాణా ప్రయాణికులతో సంభాషించారు.

Also Read : Russia-Ukraine War : ఉక్రెయిన్ నుంచి రష్యా కు మల్లి యుద్ధ సంకేతాలు..వేల కోట్ల ఆస్తుల ధ్వంసం

Leave A Reply

Your Email Id will not be published!