SA Chandrasekhar Vijay : గొడ‌వ‌లు నిజం కలవ‌డం ఖాయం

త‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రి చంద్ర‌శేఖ‌ర్

SA Chandrasekhar Vijay : ప్ర‌ముఖ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ గురించి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన వారిసు (తెలుగులో వార‌సుడు) నిర్మించిన సినిమాలో త‌ళ‌ప‌తి విజ‌య్ , ర‌ష్మిక మంధాన క‌లిసి న‌టించారు. ఈ సినిమా ఆశించిన దానికంటే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టింది. మిన‌మం గ్యారెంటీ ఉన్న న‌టుడిగా పేరు పొందారు త‌ళ‌ప‌తి విజ‌య్.

ఆయ‌న‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గ‌త కొంత కాలంగా తండ్రి చంద్ర‌శేఖ‌ర్ కు కొడుకు విజ‌య్ కు మ‌ధ్య అంత‌గా మాట‌లు లేవ‌న్న‌ది ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు భార్య‌తో కూడా స‌రిగా ఉండ‌డం లేద‌న్న పుకార్లు ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయి. ఒక డిఫ‌రెంట్ మేన‌రిజం క‌లిగిన న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్.

అత‌డి కోసం త‌మిళ‌నాడులో ప్రాణాలు తీసుకునేందుకు సిద్దంగా ఉండే ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని పార్టీలు త‌ళ‌పతి విజ‌య్ ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తంటాలు ప‌డ‌తాయి. ఆ మ‌ధ్య‌న కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన జీఎస్టీపై సెటైర్లు కూడా వేశాడు స‌ర్కార్ మూవీలో. ఈ త‌రుణంలో తాజాగా తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు త‌న త‌న‌యుడు త‌ళ‌ప‌తి విజ‌య్(SA Chandrasekhar Vijay) గురించి.

తామిద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేవ‌న్న‌ది వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి అస్స‌లు మాట్లాడు కోలేద‌ని , కానీ తండ్రీ కొడుకులు అన్నాక భేదాభిప్రాయాలు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌న్నారు. త్వ‌ర‌లో క‌లుసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌శేఖ‌ర్. ఫ్యామిలీతో క‌లిసి వారిసు చూశామ‌న్నారు.

Also Read : కోట్లు కొల్ల‌గొడుతున్న ప‌ఠాన్

Leave A Reply

Your Email Id will not be published!