చెన్నై : తమిళ సినిమా గమనాన్ని మార్చి, ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ‘దర్శక శిఖరం’ (Director Imayam) తిరు. భారతీరాజా మరణం తీవ్ర విచారాన్ని కలిగించింది అని అన్నారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. తమిళ సినిమాకు తీరని లోటుగా మారిన ఆ గొప్ప కళాకారుడి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. సినిమాలో ఒక ప్రత్యేకమైన భాషను పలికించి, తనకంటూ ఒక ప్రత్యేక శకాన్ని సృష్టించుకున్న వ్యక్తి భారతీరాజా. స్టూడియోలకే పరిమితమైన కెమెరాలు ఆయన ద్వారా పల్లెటూళ్లకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రజలను, వారి జీవన విధానాన్ని తెరపైకి తీసుకు రావడం ద్వారా ఆయన తమిళ సినిమాను వాస్తవికతకు అత్యంత దగ్గరగా తీసుకెళ్లారు.
’16 వయదినిలే’, ‘కిళక్కే పోగుమ్ రైల్’, ‘సిగప్పు రోజాక్కల్’, ‘అలైగళ్ ఓయవతిల్లై’, ‘టిక్ టిక్ టిక్’, ‘ముదల్ మరియాదై’, ‘కడలోర కవితైగళ్’, ‘వేదం పుదితు’, ‘కరుతమ్మ’ వంటి ఆయన సృష్టించిన అద్భుత చిత్రాలను తమిళ సినిమా చరిత్ర రాసే ఎవరూ విస్మరించలేరు. తన సృజనాత్మక ప్రతిభతో ఇతర భాషల్లోనూ చిత్రాలను రూపొందించి అక్కడ కూడా తనదైన ముద్ర వేసిన ఆయనను, భారతీయ చలనచిత్ర చరిత్ర ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిపి గుర్తుంచుకుంటుంది.
నేత కరుణానిధి పట్ల ఆయనకు ఎంతో ఆప్యాయత ఉండేది. తమిళం, తమిళ ప్రజల పట్ల ఉన్న గాఢమైన అనుబంధంతో, తమిళనాడు హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో సినీ పరిశ్రమను భాగస్వామ్యం చేయడంలో భారతీరాజా కీలక పాత్ర పోషించారు. ‘దర్శక శిఖరం’ భారతీరాజా, ‘సంగీత మహర్షి’ ఇళయరాజా, ‘కవితా చక్రవర్తి’ వైరముత్తుల కలయికలో రూపుదిద్దుకున్న పాటలు ఇప్పటికీ తమిళనాడులో ఏదో ఒక మూల ప్రతిధ్వనిస్తూ, వేలాది మంది ప్రజలకు ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి.
ఆయన ఆరోగ్యం గురించి తెలుసు కోవడానికి నేను ఆయనను కలిసి మాట్లాడిన సందర్భాలను, అలాగే ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజాను వ్యక్తిగతంగా పరామర్శించిన క్షణాలను గుర్తు చేసుకోవడం ఇప్పుడు నా హృదయాన్ని మరింత భారంగా మారుస్తోంది. ఆయన మరణంతో శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు, సినీ ప్రపంచంలోని కళాకారులకు, భారతీరాజా శిష్యులకు, తమిళనాడు ప్రజలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాను.
అల్లి నగరంలో జన్మించి, మనకు చిరస్మరణీయమైన చిత్రాలను అందించిన ‘దర్శక శిఖరం’ భారతీరాజా, సినిమా ప్రేమికుల హృదయాల్లో తమిళ ప్రజల హృదయాల్లో – ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొన్నారు ఎంకే స్టాలిన్. తిరు భారతీరాజాకి వ్యక్తిగతంగా నివాళులు అర్పించే సమయంలో, ఆయనతో ఉన్నవారు ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని కోరారు. దర్శకుడు ఇమయం భారతీరాజా సాధించిన విజయాలకు గుర్తింపుగా , ఆయన సన్నిహితుల కోరికలను నెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు.