VVS Laxman Dravid : రాహుల్ కు రెస్ట్ ల‌క్ష్మ‌ణుడికి ‘టెస్ట్’

బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

VVS Laxman Dravid : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఎన్నిక‌ల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన భార‌త జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ కు రెస్ట్ ఇచ్చింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు.

ఆయ‌న‌తో పాటు స్టార్ బ్యాట‌ర్ , ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మకు విశ్రాంతి ఇచ్చింది. ఓటమి దెబ్బ‌కు కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది బీసీసీఐ.

భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ టూర్ కు వెళ్ల‌నుంది. ద్ర‌విడ్ ను ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ టూర్ అకాడెమీ డైరెక్ట‌ర్ గా ఉన్న మాజీ స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్ వంగీపురం వెంక‌ట సాయి ల‌క్ష్మ‌ణ్ కు కోచ్(VVS Laxman Dravid) బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

కీవీస్ టూర్ లో భాగంగా టీమిండియా 8 వైట్ బాల్ మ్యాచ్ లు ఆడ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు టి20 మ్యాచ్ ల‌తో పాటు మూడు వ‌న్డేలు ఆడ‌నుంది భార‌ట జ‌ట్టు(Team India).

న్యూజిలాండ్ టూర్ ఈనెల 18 నుంచి ప్రారంభం కానుంది. తొలి టి20 మ్యాచ్ న్యూజిలాండ్ లోని వెల్లింగ్ట‌న్ లో ప్రారంభం అవుతుంది. ఈ టూర్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఘోరంగా వైఫ‌ల్యం చెందిన కేఎల్ రాహుల్ తో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

వారిని కూడా ప‌క్క‌న పెట్టింది. ఇక ల‌క్ష్మ‌ణ్ తో పాటు కీవీస్ టూర్ కు బ్యాటింగ్ కోచ్ గా హృషికేష్ క‌నిత్క‌ర్ , బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బ‌హుతులేను ఎంపిక చేసింది.

Also Read : రోహిత్..కోహ్లీ కొన‌సాగింపుపై ద్ర‌విడ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!