కేరళ : కేరళలో 10 రోజుల పాటు నిర్వహించే ఓనం పండుగ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. త్రిపునితురలో జరిగిన ఈ రంగుల ర్యాలీలో అలంకరించిన ఏనుగులు, శకటాలు , జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రజలు, వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది వర్షాన్ని లెక్కచేయకుండా ఈ వేడుకలను తిలకించడానికి తరలి వచ్చారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. రాజరిక కాలం నుండే కొచ్చి రాజ్యం , త్రిపునితుర లౌకికవాదానికి నిదర్శనంగా నిలిచాయని, ఎందుకంటే అన్ని మతాలు , వర్గాల ప్రజలు ‘అథచమయం’ వేడుకల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. త్రిపునితుర చరిత్ర , వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన అన్నారు. దీనిని వారసత్వ నగరంగా మార్చాలి అని ఆయన సూచించారు. నగరంలో అనేక చారిత్రక భవనాలు ఉండేవని, కానీ చాలా వరకు కూల్చివేయబడ్డాయని, మిగిలినవి కూడా క్రమంగా తొలగించ బడుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వాటిని రక్షించాలని నేను కోరుతున్నాను. ఇది వారసత్వ నగరంగా మారితే, అవి రక్షించ బడతాయి. ఐరోపా దేశాలలో ఇలాంటి పాత భవనాలను కాపాడుకుంటారు అని సతీశన్ అన్నారు. నగర వారసత్వ హోదాను కాపాడేందుకు ఎమ్మెల్యే, ఎంపీ , స్థానిక సంస్థల ప్రతినిధులు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పటి కొచ్చి రాజరిక రాజ్యానికి రాజధానిగా ఉన్న త్రిపునితుర వారసత్వాన్ని పరిరక్షించేందుకు విదేశాల నుండి నిపుణులను రప్పించి, సమస్యను అధ్యయనం చేసి, ఒక మంచి ప్రతిపాదనను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అటువంటి ప్రతిపాదన వస్తే, నగరం యొక్క వారసత్వ హోదాను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
చిన్నప్పటి నుండి ప్రతి ఏటా ఈ ఉత్సవాలను చూడటానికి తాను ఎలా వచ్చేవారో ఆయన గుర్తుచే సుకున్నారు. ఆహార , పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అనూప్ జాకబ్ ‘ఆథం’ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత, త్రిపునితురలోని ‘ఆథం నగర్’ నుండి ప్రారంభమైన ర్యాలీని మలయాళ చలనచిత్ర నటుడు జగదీష్ జెండా ఊపి ప్రారంభించారు.
