RGV Kantara : క‌న్న‌డ మూవీపై ఆర్జీవీ కామెంట్స్

స్టార్లు లేకున్నా కాంతార అద్భుతం

RGV Kantara : దేశ వ్యాప్తంగా క‌న్న‌డలో వ‌చ్చిన కాంతార మూవీ దుమ్ము రేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ఏకంగా రూ. 150 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది. విడుద‌లైన ప్ర‌తి చోటా అద్భుత‌మైన ఆద‌ర‌ణ చూర‌గొంది. ద‌ర్శ‌కుడు, న‌టుడు రిష‌బ్ శెట్టి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కాంతార చిత్రం రూపుదిద్దుకుంది.

బ్లాక్ బ్ల‌స్ట‌ర్ గా నిలిచింది. క‌న్న‌డ‌లో తీసిన ఈ మూవీని త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, త‌దిత‌ర భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అన్ని చోట్లా కాంతార చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఒక్క తెలుగులోనే రూ. 10 కోట్ల‌కు పైగా కొల్ల గొట్ట‌డం విశేషం. ఇక హిందీలో రూ. 5 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించడం విశేషం.

సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా కాంతారపై వెల్లువెత్తుతున్నాయి. సూప‌ర్ టాక్ తో ముందుకు దూసుకు పోతోంది. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స్పందించ‌గా తాజాగా ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(RGV Kantara) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంతార మూవీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న ఎవ‌రినీ కితాబు ఇవ్వ‌రు. ఏదో విశేషం అంటే త‌ప్ప ఆయ‌న స్పందించ‌రు.

స్టార్ హీరోలు, హీరోయినులు, పేరొందిన టెక్నిషియ‌న్లు ఎవ‌రూ కాంతార చిత్రంలో న‌టించ లేదు. ఎలాంటి అగ్ర తార‌లు లేకుండానే అద్భుత విజ‌యం సాధించింద‌ని పేర్కొన్నారు. చిత్రం భారీ చిత్రాల రికార్డుల‌ను తిర‌గ రాస్తోంద‌ని కితాబు ఇచ్చారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇదిలా ఉండ‌గా రూ. 16 కోట్ల బ‌డ్జెట్ తో కాంతార చిత్రం రూపొందింది.

Also Read : కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘కాంతార’

Leave A Reply

Your Email Id will not be published!