Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో 150 సీట్లు ఖాయం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీకి సంబంధించి 150 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు. కర్ణాటకలో 224 సీట్లకు గాను 135 సీట్లు సాధించి పవర్ లోకి వచ్చామని ఇదే సీన్ రేపు మధ్య ప్రదేశ్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలను ముంచిందని కానీ ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
సోమవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ సీఎం కమల్ నాథ్ , జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు మాజీ సీఎం ఏకే ఆంటోనీ కూడా ఉన్నారు. భవిష్యత్తులో సైతం తమ పార్టీ ఆశించిన దాని కంటే ఎక్కువే ఫలితాలు సాధించ బోతోందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు చేసే దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మరని పేర్కొన్నారు.
దేశంలో వనరులను విధ్వంసం చేస్తూ , మౌలిక సదుపాయాలను తన వారికి కట్టబెడుతూ వస్తున్న మోదీకి ప్రచారం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టవని మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కులం, మతం పేరుతో ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించారు. జనానికి కావాల్సింది కూడు, గూడు, ఉపాధి అని కానీ మోదీ కేవలం అదానీ జపం మాత్రమే చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
Also Read : Kalpavruksha Vahana