Chamari Athapaththu : ‘చ‌మ‌రి’ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్

శ్రీ‌లంక కెప్టెన్ కు అరుదైన గౌర‌వం

Chamari Athapaththu : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌తి నెలా పురుషుల‌, మ‌హిళ‌ల ఆటగాళ్ల ప్ర‌తిభా పాట‌వాల‌ను గుర్తించేందుకు వీలుగా ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్ర‌క‌టిస్తుంది. గ‌త సెప్టెంబ‌ర్ నెల‌కు గాను మ‌హిళా కేట‌గిరీలో అత్యుత్త‌మ క్రికెట‌ర్ గా శ్రీ‌లంక మ‌హిళా జ‌ట్టు స్కిప్ప‌ర్ చమ‌రి అట‌ప‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Chamari Athapaththu Got Award

ఈ మేర‌కు శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ప‌ష్టం చేసింది. ఇంగ్లండ్ మ‌హిళా జ‌ట్టుతో జ‌రిగిన చారిత్రాత్మ‌క సీరీస్ ను చేజిక్కించు కోవ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించింద‌ని చ‌మ‌రి అట‌ప‌ట్టు గురించి పేర్కొంది ఐసీసీ(ICC) అవార్డ్స్ క‌మిటీ. అందుకే ఆమెను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపింది.

ద‌క్షిణాఫ్రికా జోడీ లారా వోల్వార్ట్ , నాడిన్ డి క్లెర్క్ ల‌ను కాద‌ని శ్రీ‌లంకకు చెందిన చ‌మ‌రి అద్భుతంగా రాణించ‌డంతో ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొంది. ఐసీసీ మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూడా దుమ్ము రేపింద‌ని తెలిపింది ఐసీసీ. ఇంగ్లండ్ పై రాణించింద‌ని 114 ర‌న్స్ తో పాటు 5 వికెట్లు తీసింద‌ని వెల్ల‌డించింది.

Also Read : Modi Govt Issues : కేంద్రం కీల‌క నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!