Telangana Congress List : 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

ఉత్కంఠ‌కు తెర దించిన ఏఐసీసీ

Telangana Congress List : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress) 55 మందితో కూడిన అభ్య‌ర్థుల తొలి జాబితాను ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా ఎవ‌రికి సీట్లు ల‌భిస్తాయ‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేసింది ఏఐసీసీ. ఇప్ప‌టికే బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

Telangana Congress List Viral

కులాల వారీగా స‌మీక‌ర‌ణాలు, గెలుపు ఛాన్సెస్ ఉన్న వారికి, స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది కాంగ్రెస్ స్క్రీనింగ్ క‌మిటీ. క‌ల్వ‌కుర్తికి క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, మ‌ల్కాజ్ గిరికి మైనంప‌ల్లి హ‌నుమంత రావు, మెద‌క్ కు మైనంప‌ల్లి రోహిత్ ను ఎంపిక చేసింది. ఇదే స‌మ‌యంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో పాటు ఉత్త‌మ్ ప‌ద్మావ‌తికి కూడా సీట్లు కేటాయించింది.

జానా రెడ్డి కొడుకుకు కూడా సీటు ద‌క్క‌డం విశేషం. పార్టీలో తీర్మానం చేసిన రెండు ప‌ద‌వుల‌కు మంగ‌ళం పాడింది. తొలి జాబితాలో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావుకు ఛాన్స్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో సీపీఐకి చెన్నూరు, కొత్త‌గూడెం సీట్ల‌ను కేటాయించ‌నున్న‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో 55 సీట్ల‌ను ఖ‌రారు చేసిన ఏఐసీసీ, మ‌ధ్య ప్ర‌దేశ్ లో 144 సీట్ల‌కు, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో 30 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

Also Read : IND vs PAK ICC World Cup : భార‌త్ భ‌ళా పాక్ విల‌విల

Leave A Reply

Your Email Id will not be published!