Speaker Om Birla : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించిన లోక్ సభ స్పీకర్

పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు....

Speaker Om Birla : కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత. టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఏదైనా అంశంపై రామ్మోహన్ మాట్లాడితే శభాష్‌ అని.. వారెవ్వా సిక్కోలు సింగం అనకుండా ఉండలేరు. తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభినందనలు పొందారు రామ్మోహన్. ఇంతకీ ఏ విషయంలోనో చూద్దాం వచ్చేయండి.. పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు.. సభ్యులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. దీంతో రామ్మోహన్‌ నాయుడిని స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) అభినందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని స్పీకర్ కితాబిచ్చారు. పౌర విమానయాన శాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రామ్మోహన్‌ నాయుడు సమాధానం ఇచ్చారు.

Speaker Om Birla Appreciates..

దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలు, పరిశ్రమలు, విమానయాన సంస్థలతో ఎలాంటి చర్యలు తీసుకుంది, కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి ఎలాంటి శిక్షణ ఇస్తుందని బీజేపీ సభ్యుడు దుష్యంత్‌ సింగ్‌ ప్రశ్నించారు. దీనిపై రామ్మోహన్ సమాధానమిస్తూ.. దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏవిధంగా కృషి చేస్తుందో వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంచిగా సమాధానం చెపుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్‌కు స్పీకర్ ఓం బిర్లా కితాబిచ్చారు.

Also Read : Minister Seethakka : గత సర్కారు పని వల్లనే ఇప్పుడు పంచాయతీలకు ఇన్ని పాట్లు

Leave A Reply

Your Email Id will not be published!