Manipur Floods : మణిపూర్ వరదలకు 10 వేల ఇళ్లకు పైగా ధ్వంసం

Manipur : మణిపూర్‌లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 56,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. వరదల వల్ల 10,477 ఇళ్లు దెబ్బతిన్నాయని, 56,516,174 మంది బాధితులయ్యారని తెలిపింది. సోమవారం ఇంఫాల్ తూర్పు జిల్లాలో నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి గల్లంతయ్యాడని, 2,913 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి తరలించామని తెలిపింది. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించడానికి 57 రహదారి క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

Manipur Floods Updates

సోమవారం కొంగ్బా నది తన కట్టలను దాటిన తర్వాత ఇంఫాల్ తూర్పు జిల్లాలోని బషిఖోంగ్ వద్ద మళ్ళీ కట్ట తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరదల బారిన పడిన జిల్లా ఇంఫాల్ తూర్పు జిల్లాలో బాధితుల కోసం కనీసం 57 సహాయ శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజుల్లో తొంభై మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాలు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖురాయ్, హీంగాంగ్, చెకాన్ ప్రాంతాలలో నది కట్టలను చీల్చుకుని పొంగి ప్రవహించింది.

Also Read : Minister Anagani : మాజీ సీఎం జగన్ పై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!