PSR Anjaneyulu-High Court : సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ కు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు

అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది...

PSR Anjaneyulu : సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు మరియు ఏ2 దాత్రి మధు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు(AP High Court) సోమవారం తిరస్కరించింది. అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది.

PSR Anjaneyulu – AP High Court

పీఎస్ఆర్ ఆంజనేయులు ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తే, తాజా మెడికల్ రిపోర్టులను సమర్పించి, విచారించి, రెండు వారాల్లో ఆయన బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు, దాత్రి మధు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఇదే కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయుల రిమాండ్‌ను కోర్టు జూన్ 19వ తేదీ వరకు పొడిగించింది. ఆయన రిమాండ్ జూన్ 5తో ముగియగా, అదే రోజు కోర్టులో హాజరయ్యారు. తద్వారా కోర్టు రిమాండ్‌ను మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసు మొత్తం పీఎస్ఆర్ ఆంజనేయులను కేంద్రబిందువుగా చేసుకొని సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేశారు.

ఆ సమయంలో గ్రూప్ 1 మ్యూల్యాంకనాన్ని నిబంధనలకు విరుద్ధంగా మరో ప్రదేశంలో, ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏ1గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2గా దాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. దాత్రి మధు విచారణలో కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది. పీఎస్ఆర్ ఆదేశాలతోనే తాను పనిచేశానని ఆయన చెప్పినట్టు సమాచారం.

ఈ మ్యూల్యాంకనం సమయంలో ఆహార ఖర్చుల పేరుతో రూ. 20 లక్షలు, అలాగే రూ. కోటి పైగా మొత్తాన్ని దాత్రి మధుకు పీఎస్ఆర్ ఆంజనేయులు విడుదల చేసినట్టు విచారణలో వెలుగుచూసింది. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయంలో ఆయన పోలీసులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్టు సమాచారం. ఇదికాక ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ అనారోగ్యానికి లోనవుతున్నట్టు సమాచారం.

Also Read : Rahul Gandhi : విజన్ 2047 పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!