ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన హిందీ మూవీ దురంధర్ -1, 2 దుమ్ము రేపాయి. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది అరుదైన రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి కారణం ఆదిత్య ధర్ నుంచి దురంధర్ మూవీ సీక్వెల్ గా దురంధర్ -3 రానుందని సమాచారం. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇండియాకు చెందిన ఏజెంట్ పాకిస్తాన్ లో ఎంటర్ అయి చేసిన సాహసాలు, విన్యాసాల తో కూడిన దృశ్యాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే అనధికార అంచనా ప్రకారం ఏకంగా రూ. 3,000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఇక దురంధర్ -2లో రణ్ వీర్ సింగ్, సారా అర్జున్ కీ రోల్ పోషించారు. మరో వైపు రణ్ వీర్ సింగ్ కీ రోల్ పోషిస్తూ ధురందర్ ఫ్రాంచైజీ మూడవ భాగంతో తిరిగి రావచ్చు అని టాక్. నిర్మాత జ్యోతి దేశ్పాండే ఇటీవల అభిమానుల మధ్య ఈ చర్చను రేకెత్తించారు. ఈ సిరీస్తో తమ బృందం ఇంకా పూర్తి చేయలేదని ఆమె సూచించారు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఉండబోతుందని భావిస్తున్నారు. దీంతో ధురందర్ 3 రానుందనే నమ్మకం చాలా మందిలో ఏర్పడింది. మొదటి చిత్రం 2025లో భారీ విజయం సాధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది భారత చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఏ-రేటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
దీని సీక్వెల్, ధురందర్ ది రివెంజ్, ఇంకా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇది మార్చి 2026లో విడుదలైంది. ఏడు వారాల్లోనే, ఇది ప్రపంచ వ్యాప్తంగా 1,840 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది బాహుబలి 2 జీవితకాల వసూళ్లను కూడా అధిగమించింది.