న్యూఢిల్లీ : ఆయన భారత దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రతినిధి. కోట్లాది మంది ఆయన ఇచ్చే తీర్పు పట్ల ఆసక్తితో ఎదురు చూస్తారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీజేఐ ఉన్నట్టుండి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాజాగా నిరుద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. వారిని సీజేఐ సూర్య కాంత్ బొద్దింకలతో పోల్చారు. వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్టిఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తారని ఆయన అన్నారు. సీనియర్ అడ్వకేట్ హోదాను అనుసరిస్తున్న ఒక న్యాయవాదిని సీజేఐ కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మందలిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే సమాజంలో ఉన్నారు. మీరు వారితో చేతులు కలపాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
బొద్దింకల వంటి యువకులు ఉన్నారు, వారికి ఎలాంటి ఉపాధి లభించదు లేదా వృత్తిలో స్థానం ఉండదు. వారిలో కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలు, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేయడం ప్రారంభిస్తారంటూ నోరు పారేసుకున్నారు. ప్రపంచం మొత్తం సీనియర్ అడ్వకేట్ కావడానికి అర్హులు కావచ్చు, కానీ కనీసం మీకు మాత్రం ఆ అర్హత లేదంటూ వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కు సీనియర్ అడ్వకేట్ హోదాను ప్రదానం చేస్తే, అతని వృత్తిపరమైన ప్రవర్తనను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని సీజేఐ కాంత్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఫేస్బుక్లో ఉపయోగించినట్లు ఆరోపించబడిన భాషను కూడా సీజేఐ ప్రస్తావించారు. పిటిషనర్కు మరేదైనా వ్యాజ్యం ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీనియర్ అడ్వకేట్ హోదా అనేది కేవలం అలంకార ప్రాయంగా ఉంచుకోవలసిన హోదా చిహ్నమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.