నాగ్ అశ్విన్ ‘కల్కి -2’లో సాయి పల్లవి నటిస్తుందా..?
అధికారికంగా ధ్రువీకరించని మూవీ మేకర్స్, నిర్మాత
హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మోస్ట్ పాపులర్ దర్శకుడైన నాగ్ అశ్విన్ పై పడింది. తను అమితాబ్ బచ్చన్ , ప్రభాస్ తో కలిసి కల్కి సినిమా తీశాడు. అది భారత దేశ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా చేరింది. దీంతో ఆ సినిమాకు ఉన్న ఆదరణను చూసిన దర్శక, నిర్మాతలు ఉన్నట్టుండి కల్కి-2 మూవీ సీక్వెల్ ప్రకటించారు. ఆ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఇందులో నేచురల్ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు మూవీ మేకర్స్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు తన పాత్ర గురించి, నటిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సాయి పల్లవి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఇక చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ఆచితూచి పాత్రలను ఎంచుకునే నటీమణులలో ఒకరిగా సాయి పల్లవికి మంచి పేరుంది. ఆమె ఆ జాగ్రత్తతో కూడిన విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘కల్కి 2’ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కల్కి 2 షూటింగ్లో సాయి పల్లవి పాల్గొనడం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు, ప్రస్తుతానికి పరిస్థితి అస్పష్టంగానే ఉంది అని ఒక వర్గం పేర్కొంది. ‘యల్లమ్మ’, ‘మా ఇంటి బంగారం’ వంటి భారీ తెలుగు చిత్రాలను తిరస్కరించినట్లు సమాచారం ఉన్నందున, చివరికి ఆమె ‘కల్కి 2’లో భాగమవుతారా లేదా అని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
