Daren Sammy : భారత్ తో వెస్టిండీస్ టీ20, వన్డే సీరీస్ ఆడనుంది. ఇప్పటికే ఆ జట్టును డిక్లేర్ చేసింది డెస్మండ్ హెయిన్స్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ. ఈ సందర్భంగా ఇండియా టూర్ ను పురస్కరించుకుని విండీస్ మాజీ స్కిప్పర్ డారెన్ సామీ(Daren Sammy) కీలక వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్ పొలార్డ్ తో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు భారత్ తో దగ్గరి అనుబంధం ఉందన్నాడు. చాలా కాలంగా ఐపీఎల్ లో ఆడడం వల్ల వాళ్లు రాటుదేలి పోయారని పేర్కొన్నాడు.
దీంతో భారత్ లో భారత్ కంటే విండీస్ టీంకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి.
భారత్ లో గ్రౌండ్ ల పరిస్థితి ఏమిటో తమ జట్టులోని ఆటగాళ్లు అర్థం చేసుకున్నారని ప్రత్యర్థి జట్టుపై మరింత ఒత్తిడి పెంచే సత్తా తమ వారికి ఉందన్నాడు డారెన్ సామీ(Daren Sammy)
పొలార్డ్ ఏ సమయంలోనైనా ఆల్ రౌండ్ ప్రదర్శన చేసేందుకు రెడీగా ఉన్నాడని అన్నాడు. ఇదిలా ఉండగా మూడు వన్డేలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి.
ఇక టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించేందుకు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
కరోనా మహమ్మారి కారణంగా జర్నీ ఉండ కూడదనే ఉద్దేశంతో మ్యాచ్ లను రెండు వేదికలకే పరిమితం చేసింది. ఇక విండీస్ టూర్ లో భాగంగా మొదటి వన్డే ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది.
Also Read : ఆ నలుగురిపై యువీ కీలక కామెంట్స్