Akshay Kumar : అక్ష‌య్ కుమార్ కు అరుదైన గౌర‌వం

ఉత్త‌రాఖండ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక‌

Akshay Kumar  : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. తాజాగా ఉత్త‌రాఖండ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అక్ష‌య్ కుమార్ (Akshay Kumar )ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇందుకు సంబంధించి అధికారికంగా ధ్రువీక‌రించారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి. అక్ష‌య్ బ్రాండ్ వాల్యూ భారీ ఎత్తున ఉంది. ఇప్ప‌టికే ఆదాయ ప‌రంగా ఫోర్డ్స్ జాబితాలో కూడా చేరాడు ఈ దిగ్గ‌జ న‌టుడు.

అక్ష‌య్ కుమార్ కు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. త‌న‌కు వ‌చ్చిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

త‌న‌దైన రీతిలో దాతృత్వాన్ని చాటుకుంటున్నారు అక్ష‌య్ కుమార్(Akshay Kumar ). ఇదిలా ఉండగా ఉత్త‌రాఖండ్ సీఎం ధామి చేసిన ప్ర‌తిపాద‌న‌ను స్టార్ హీరో ఒప్పుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఈ విష‌యంపై కూడా ధామి, అక్ష‌య్ కుమార్ ఇద్ద‌రూ ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసుకున్నారు. యువ‌త‌కు కొంత కాలం నుంచి స్ఫూర్తిగా ఉన్నారు. త‌న‌కు స్నేహితుడైన అక్ష‌య్ కుమార్ ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

ఉత్త‌రాఖండ్ అభివృద్ధికి అన్ని విధాల స‌హ‌క‌రిస్తార‌ని హామీ ఇచ్చారు ఈ సంద‌ర్భంగా న‌టుడు అక్ష‌య్ కుమార్. ఇదే స‌మ‌యంలో ఈ న‌టుడు ముస్సోరిలో వాహ‌నంలో వెళుతూ ఉన్న వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ కూడా చేశాడు

. ప్ర‌స్తుతం ఈ వీడియో హ‌ల్ చ‌ల్ అవుతోంది. ఇక నుంచి దైవ భూమిలో షూటింగ్స్ చేసుకుందామ‌ని సూచించాడు.

Also Read : డిజే టిల్లు’ మూవీ రెస్పాన్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!