Shimron Hetmyer : ఈసారి ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు షిమ్రాన్ హెట్మెయర్(Shimron Hetmyer ). ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీ అంటున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. గత నెల ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అన్ని జట్లు ఈ స్టార్ హిట్టర్ ను తీసుకునేందుకు పోటీ పడ్డాయి.
చివరకు రాజస్థాన్ రాయల్స్ హెట్మెయర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ. 8.5 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ టీంకు ఆడడం తనకు సంతోషంగా ఉందన్నాడు.
పూర్తిగా వంద శాతం ఎఫర్ట్ పడతానని ప్రత్యర్థి జట్లు ఏవైనా సత్తా చాటడమే తన ముందున్న టార్గెట్ అని స్పష్టం చేశాడు. స్నేహితుడు ఎవిన్ లూయిస్ ఆర్ఆర్ మేనేజ్ మెంట్ గురించి చాలా గొప్పగా చెప్పాడని తెలిపాడు.
ఆర్సీబీలో ఉన్నప్పుడు ఆడేందుకు ప్రయత్నం చేశా. ప్రపంచంలో క్రికెటర్లకు గొప్ప అవకాశం ఐపీఎల్. ఎంతో నేర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నాడు హెట్మెయర్(Shimron Hetmyer ).
ప్రత్యేకించి నన్ను నేను గొప్పగా ప్రూవ్ చేసుకునేందుకు మార్గంగా దోహద పడిందన్నాడు. ప్రస్తుతం 25 ఏళ్ల వయసు కలిగిన ఈ విండీస్ దిగ్గజ ఆటగాడు ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడంటే ఇక ఆపడం ఎవరి తరం కాదు.
2016లో అండర్ -19 విండీస్ జట్టులో ఉన్నా. అది కూడా తనకు ఎంతగానో ఉపయోగ పడిందన్నాడు. ప్రపంచంలో క్రికెట్ దిగ్గజంగా పేరొందిన కుమార సంగక్కర డైరెక్టర్ గా ఉన్నారు.
ఇక మరో స్టార్ ప్లేయర్ , ఫ్రెండ్ సంజూ శాంసన్ సారథ్యంలో ఆడడం తనకు సంతోషంగా ఉందన్నాడు హెట్మెయర్. మేము తప్పకుండా కప్ గెలుస్తామన్న నమ్మకం వ్యక్తం చేశాడు.
Also Read : కిర్మానితో అజ్బూ భాయ్ ముచ్చట