Abburi Chayadevi: స్త్రీవాద రచయిత

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి

అబ్బూరి ఛాయాదేవి

Abburi Chayadevi : అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 13, 1933 – జూన్ 28, 2019): ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. రాజమహేంద్రవరంలో జన్మించిన ఛాయాదేవి 1951-53 మధ్య నిజాం కళాశాలలో ఎం.ఏ. పూర్తి చేసారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన “అనుభూతి” ఛాయాదేవి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఛాయాదేవి భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.

Abburi Chayadevi – ఛాయాదేవి సాహిత్య ప్రస్థానం

ఛాయాదేవి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది. ఛాయాదేవి రచించిన అనేక కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. ‘అబ్బూరి ఛాయాదేవి(Abburi Chayadevi) కథలు’, ‘తన మార్గం’, ‘మృత్యుంజయ’ అనే విభిన్న రచనలతో ప్రసిద్ధి తెచ్చుకున్న ఛాయాదేవి 1952లోనే ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన ‘కవిత’ అనే పత్రికకు సంపాదకురాలుగా ఉన్నారు.

అవార్డులు

1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.

Also Read : Volgla: స్త్రీవాద ఉద్యమానికి ప్రతీక

Leave A Reply

Your Email Id will not be published!