YS Sharmila : తండ్రీ కొడుకులు తెలంగాణ ద్రోహులు

నిప్పులు చెరిగిన వైఎస్సార్టీపీ చీఫ్ ష‌ర్మిల

YS Sharmila : హైద‌రాబాద్ – వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ , త‌న‌యుడు మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల వేళ మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ ను ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

YS Sharmila Slams KCR and KTR

తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ తెలంగాణ పాలిట శాపంగా మారార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారిద్ద‌రూ తెలంగాణ ద్రోహులుగా ష‌ర్మిల(YS Sharmila) అభివ‌ర్ణించారు. అభివృద్దిపై చ‌ర్చించే ద‌మ్ము, ధైర్యం లేక అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మండిప‌డ్డారు. ప‌దేళ్లు కావ‌స్తున్నా ఇంకా సెంటిమెంట్ ను సాకుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం సిగ్గు చేటు అన్నారు ష‌ర్మిల‌.

నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన ఘ‌న‌త కేసీఆర్, కేటీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. రాష్ట్ర సంప‌ద‌నంతా దోచుకున్న‌ది కాక మ‌రోసారి లూటీ చేద్దామ‌ని క‌ల‌లు కంటున్నార‌ని కానీ వాళ్ల ఆట‌లు ఇక సాగ‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

నిధులు మీ ఖ‌జానాకు, నీళ్లు మీ ఫామ్ హౌస్ ల‌కు నియామ‌కాలు మీ కుటుంబానికి చేరాయ‌ని ఇక ప్ర‌జ‌లకు ఏం మిగిలించార‌ని మ‌ళ్లీ గెలిపించ‌మ‌ని అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు ష‌ర్మిల‌.

Also Read : Abburi Chayadevi: స్త్రీవాద రచయిత

Leave A Reply

Your Email Id will not be published!