Hyderabad Metro Rail: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !

ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !

Hyderabad Metro Rail: ఉగాది సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail) సంస్థ శుభవార్త అందించింది. సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ ఆపర్లను మరో 6 నెలలపాటు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్‌లు మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. గతంలో హైదరాబాద్ మెట్రో ప్రకటించిన ఆఫర్లు మార్చి 31, 2024తో ముగిసాయి. దీనితో వేసవి రద్దీను దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్లను కొనసాగించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. దీనితో వేసవిలో మెట్రో ప్రయాణీకులకు షాక్ తగిలినట్లేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఉగాది సందర్భంగా హైదరాబాద్ మెట్రో అధికారులు ఆ ఆఫర్లను తిరిగి ప్రవేశపెట్టారు.

Hyderabad Metro Rail Good News

కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్‌లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది.

Also Read : MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు !

Leave A Reply

Your Email Id will not be published!