KA Paul : నాతో వ‌స్తే సీఎం చేస్తా – పాల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బంప‌ర్ ఆఫ‌ర్

KA Paul : అమ‌రావ‌తి – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌నసేనాని త‌న‌తో క‌లిసి వ‌స్తే ప‌వ‌న్ ను రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా చేస్తాన‌ని జోష్యం చెప్పారు.

KA Paul Comment

తాజాగా కేఏ పాల్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 175 స్థానాలు ఉండ‌గా తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన కు 24 సీట్ల‌ను మాత్ర‌మే ఇస్తాన‌ని చ‌ర్చ‌ల్లో తేల్చి చెప్పింది. దీనిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డాక్ట‌ర్ కేఏ పాల్.

ప్ర‌జా శాంతి పార్టీతో జ‌న‌సేన పార్టీ క‌లిసేందుకు ముందుకు వ‌స్తే తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు 48 సీట్లు ఇస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని అత్య‌ధిక ప్ర‌జ‌లు త‌న వైపు ఉన్నార‌ని, తానే ముందుండి ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు కేఏ పాల్(KA Paul). పార్టీ అభ్య‌ర్థుల అంద‌రి త‌ర‌పున తాను ప్ర‌చారం చేస్తాన‌ని , ద‌గ్గ‌రుండి గెలిపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ప్రజా శాంతి పార్టీ చీఫ్‌.

అంత‌కు ముందు డాక్ట‌ర్ కేఏ పాల్ తెలంగాణ‌లో కొత్త‌గా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఆయ‌న ఎందు కోసం క‌లిశార‌నే దానిపై రాజ‌కీయ వ‌ర్గాల‌లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : Shakeel Son Case : మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు ప‌రార్

Leave A Reply

Your Email Id will not be published!